కల్తీ మద్యంపై నిరసనలు | - | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యంపై నిరసనలు

Oct 13 2025 6:14 AM | Updated on Oct 13 2025 6:14 AM

కల్తీ మద్యంపై నిరసనలు

కల్తీ మద్యంపై నిరసనలు

పుంగనూరు : కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం మాఫియా, వేల కోట్ల రూపాయలను చట్ట వ్యతిరేకంగా దోచుకోవడంపై సోమవారం ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్ల వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఆదివారం తిరుపతిలో పుంగనూరు నియోజకవర్గ నాయకులు , వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, వల్లివేడు పృధ్వీధర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీంబాషాలతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం వ్యాపారంతో వేల కోట్లు దోచుకుంటున్న తెలుగుదేశం నాయకుల వ్యాపారాల గురించి ప్రజలకు వివరిస్తూ చైతన్యం చేయాలన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని సూచించారు. కార్యక్రమంలో పుంగనూరు పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్‌, నాయకులు గౌస్‌, అఖిల్‌, బావాజాన్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో..

శ్రీకాళహస్తి: కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమలా తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మదుసూదన్‌రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారులకు సోమవారం వినతిపత్రం ఇవ్వనున్నట్లు వైఎస్‌ఆర్‌ సీపీ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ మండల ఎంపీటీసీలు, సర్పంచులు, నేతలు, మహిళలు, అనుబంధ విభాగాల నేతలు పాల్గొనాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement