అది న్యాయవ్యవస్థపై దాడి | - | Sakshi
Sakshi News home page

అది న్యాయవ్యవస్థపై దాడి

Oct 8 2025 6:07 AM | Updated on Oct 8 2025 6:07 AM

అది న్యాయవ్యవస్థపై దాడి

అది న్యాయవ్యవస్థపై దాడి

● సీజేఐపై దాడికి యత్నం దుర్మార్గం ● దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది ● ఎంపీ గురుమూర్తి

● సీజేఐపై దాడికి యత్నం దుర్మార్గం ● దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది ● ఎంపీ గురుమూర్తి

తిరుపతి కల్చరల్‌: భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయిపై దాడికి యత్నించడాన్ని భారత న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా చూడాలని ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి ఒక ప్రక టనలో తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండిస్తు న్నాని పేర్కొన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిందని, న్యాయం, రాజ్యాంగ విలువలను గౌరవించే ప్రతి భారతీయుడి మనస్సాక్షిని కదిలించిందని అన్నారు. భారత న్యాయవ్యవస్థ మన రాజ్యాంగాన్ని ప్రజలకు హక్కులను కాపాడాడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన గుర్తుచేశారు. ఈ క్లిష్ట సమయంలో తాను ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయితో పాటు మొత్తం న్యాయవ్యవస్థకు మద్దతు ప్రకటిస్తున్నాని తెలిపారు. బీఆర్‌ గవాయి సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటూ న్యాయస్ఫూర్తిని నిలబెట్టేందుకు దేవుడు ఆయనకు మరింత శక్తి, ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement