
కుటుంబ కలహాలకు అ‘బలి’
● భార్యాబిడ్డలను బావిలో తోసి చంపేశాడు! ● కుటుంబ కలహాలే కారణం అంటున్న స్థానికులు
పాకాల: భార్యపై అనుమానం.. కుటుంబ కలహా లు.. హతుడికి మానసికరోగం.. వెరసి అబలతోపాటు ఇద్దరు చిన్నారులు బలైపోయారు. మద్దినాయనపల్లి పంచాయతీ పెద్దహరిజనవాడ గ్రామానికి చెందిన గిరి తన అక్క ఇంటి వద్ద ఉన్న భార్యాపిల్లలను తీసుకుని వస్తూ మార్గం మధ్యలోని తన తండ్రి వర్ధంతి సందర్భంగా సమాది వద్ద పూజలు చేశాడు. అనంతరం అదే దారిలోని బావిలో భార్యా బిడ్డలను తోసి హతమార్చాడు. గిరి తిరుపతిలో ఎలక్ట్రీషియన్ పని చేస్తుండగా అతడి భార్య హేమంతకుమారి(33) లీలామహ ల్ వద్ద పండ్ల వ్యాపారం చేస్తోంది. వీరికి పెద్ద కుమార్తె తనుశ్రీ(10), రెండవ కుమార్తె తేజశ్రీ(6) పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో గిరి కుటుంబంతో తిరుపతిలోనే జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల కిందట గిరి పులిచెర్ల మండలం ఈ–రామిరెడ్డిగారిపల్లిలోని తన అక్క గారి ఇంటికి కుటుంబంతో కలిసి వెళ్లాడు. అక్కడే మూడు రోజులు గడిపాడు. గురువారం తన తండ్రి వర్దంతి సందర్భంగా తిరిగి తన స్వగ్రామమైన పెద్దహరిజనవాడకు బయలుదేరాడు. మార్గం మధ్య లోని తన తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో క లిసి పూజలు చేశాడు. ఆ తరువాత బయలు దేరి అదే మార్గంలోని కొత్త ఒడ్డిపల్లి గంగనబోయని బావి వద్ద కు వారిని తీసుకెళ్లి, భార్యాబిడ్డలను బావిలోకి తోసేశాడు. వారు మరణించారని నిర్ధారించుకున్న తరువా త తాను బావిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయాన్ని నిందితుడు ఆత్మహత్యకు యత్నించే ముందు తన సోదరుడికి ఫోన్లో చెప్పడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే తల్లీబిడ్డలు మరణించారు. గిరిని వారు కాపాడి ఆస్ప త్రికి తరలించారు. కాగా రెండు మూడు రోజులుగా గిరి మానసిక పరిస్థితి బాగా లేదని అతడి సమీప బంధువులు చెబుతున్నారు. అలాగే కుటుంబ కలహాల కా రణంగానే వారిని హత్య చేశారని మృతుల బంధువు లు చెబుతున్నారు. బొమ్మల్లాంటి బిడ్డలను హతమార్చడానికి నీకు చేతులు ఎలా ఆడాయిరా నాయనా అని మృతుల బంధులు రోదనలు చూసిన వారి కంటతడి పెట్టిస్తున్నాయి. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలకు అ‘బలి’