● అలంకారప్రాయంగా తుడా ఉద్యానవనం ● తుడా నిర్వహణ లోపంతో అధ్వాన్నంగా పార్కు ● మందుబాబులకు అడ్డాగా పార్కు ● ఆహ్లాదం, ఆరోగ్యానికి దూరంగా తిరుమలనగర్‌ ప్రజలు ● రూ.లక్షలు ఖర్చు చేసినా పట్టించుకోని అధికారులు | - | Sakshi
Sakshi News home page

● అలంకారప్రాయంగా తుడా ఉద్యానవనం ● తుడా నిర్వహణ లోపంతో అధ్వాన్నంగా పార్కు ● మందుబాబులకు అడ్డాగా పార్కు ● ఆహ్లాదం, ఆరోగ్యానికి దూరంగా తిరుమలనగర్‌ ప్రజలు ● రూ.లక్షలు ఖర్చు చేసినా పట్టించుకోని అధికారులు

May 5 2025 8:30 AM | Updated on May 5 2025 8:30 AM

● అలం

● అలంకారప్రాయంగా తుడా ఉద్యానవనం ● తుడా నిర్వహణ లోపంతో

తిరుపతి మంగళం : ప్రతి మనిషికి ఆహ్లాదకర వాతావరణం..వ్యాయామం ఎంతో ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. రాత్రింభవళ్లు శ్రమించి కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరితే ఆ రోజు చేసిన కష్టాన్నంతా మరిచిపోతాం. ఈ నేపథ్యంలోనే మంగళం పరిధి తిరుమలనగర్‌ పంచాయతీలోని తుడా క్వార్టర్స్‌లో పంచాయతీ ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం పంచాలనే ఆలోచనతో గత వైఎస్సార్‌సీపీ పాలనలో అప్పటి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సహకారంతో అప్పటి తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సుమారు రూ.32 లక్షలు ఖర్చు పెట్టి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్థానిక ప్రజలు ఎంతో ఉల్లాసంగా ..ఆనందంగా సేద తీరేవారు. ప్రస్తుతం పార్కు నిర్వహణ గాడి తప్పింది.

నిర్వహణ పట్టించుకోకపోవడం

ఉద్యానవన నిర్వహణ చూసుకుంటూ అక్కడ పచ్చని మొక్కలను పెంచాల్సిన తుడా అధికారుల నిర్వహణ లోపం స్థానిక ప్రజలకు శాపంగా మారింది. రూ.లక్షలు ఖర్చు చేసిన ఉద్యాన వనాన్ని తుడా గాలికి వదిలేసింది. దీంతో ఉద్యానవనం కాస్త మందుబాబులకు, గంజాయి, మత్తుపదార్థాలు సేవించే వారికి అడ్డాగా మారింది.

మందుబాబులకు అడ్డాగా పార్కు

చంద్రగిరి నియోజకవర్గం మంగళం తిరుమలనగర్‌ పంచాయతీలోని తుడా క్వార్టర్స్‌లో మూడేళ్ల కిందట తుడా ఆధ్వర్యంలో అప్పటి తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆహ్లాదకరమైన ఉద్యానవనం ఏర్పాటు చేశారు. తుడా హెచ్‌ఐజీ వెంచర్‌ పరిధిలో గతంలోనే పార్కు కోసం కేటాయించిన సుమారు ఎకరా పరిధిలో చుట్టూ ప్రహరీ నిర్మాణంతో పచ్చటి చెట్లను నాటి బోరు మోటారు పెట్టి స్థానిక ప్రజలు సేద తీరడానికి రాతి బల్లలు , అందమైన రోడ్లు వేసి మిరుమిట్లు గొలిపేలా సెంటర్‌లైట్‌ విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో వాకింగ్‌ ట్రాక్స్‌, జిమ్‌ పరికరాలను ఏర్పాటు చేసి అందమైన ఉద్యానవనాన్ని అక్కడి ప్రజలకు అందించారు. అయితే పట్టుమని పదిరోజులు కూడా పార్కును నిర్వహించకుండా తుడా గాలికి వదిలేసింది. కనీసం పార్క్‌ నిర్వహణను పంచాయతీ పాలకులకు కూడా అప్పజెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పిచ్చి మొక్కలు, ఎండిన ముళ్లపొదలతో పార్క్‌ కళావిహీనంగా మారిపోయింది. తుడా నిర్లక్ష్యంగా వదిలేసింది. దీంతో మందుబాబులకు అడ్డాగా మారింది. వారి ఆగడాలకు స్థానికుల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తుడా అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు ఆహ్లాదాన్ని పంచకపోగా వారి పాలిట శాపంగా మారింది.

ఆహ్లాదం, ఆరోగ్యానికి దూరంగా తిరుమలనగర్‌ పంచాయతీ ప్రజలు

మంగళంలోని తిరుమలనగర్‌ పంచాయతీ ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని అందించాలనే మంచి ఆలోచన, ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తుడా క్వార్టర్స్‌లో సుమారు రూ. 32 లక్షలు ఖర్చు చేసి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. అందమైన పూలమొక్కలు, పచ్చటి చెట్లు, ప్రజలు సేదతీరడానికి రాతి బెంచీలు, పిల్లలు ఆడుకోవడానికి ఆటవస్తువులు, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్‌ ట్రాక్‌, జిమ్‌ పరికరాలను అందుబాటులో ఉంచారు. ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే తుడా అధికారుల నిర్వహణ సరిగ్గా లేక పచ్చదనాన్ని పంచాల్సిన ఉద్యానవనం పిచ్చిమొక్కలతో వెలవెలబోయింది. ఉద్యానవనం నిర్వహణ గాలికి వదిలేసిన తుడా అధికారులపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఉద్యావన నిర్వహణ తుడాకు చేతకాకపోతే పంచాయతీకి అప్పగించవచ్చు కదా అని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

● అలంకారప్రాయంగా తుడా ఉద్యానవనం ● తుడా నిర్వహణ లోపంతో  1
1/3

● అలంకారప్రాయంగా తుడా ఉద్యానవనం ● తుడా నిర్వహణ లోపంతో

● అలంకారప్రాయంగా తుడా ఉద్యానవనం ● తుడా నిర్వహణ లోపంతో  2
2/3

● అలంకారప్రాయంగా తుడా ఉద్యానవనం ● తుడా నిర్వహణ లోపంతో

● అలంకారప్రాయంగా తుడా ఉద్యానవనం ● తుడా నిర్వహణ లోపంతో  3
3/3

● అలంకారప్రాయంగా తుడా ఉద్యానవనం ● తుడా నిర్వహణ లోపంతో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement