
చెర్లోపల్లిలో శతాధిక వృద్ధుడి మృతి
● 43 ఏళ్లు సర్పంచ్గా సేవలందించిన వైనం ● నివాళులర్పించిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, చెర్లోపల్లి గ్రామానికి చెందిన విప్పర్ల రెడ్డెప్ప నాయుడు (103) బుధవారం మృతి చెందారు. 1922లో జన్మించిన ఆయన 103 ఏళ్లు జీవనం సాగించారు. అది కూడా సాదాసీదా జీవితం కాదు.. ప్రజా జీవితం గడిపారు. చెర్లోపల్లి పంచాయతీకి 43 ఏళ్లు సర్పంచ్గా సేవలందించిన ఘనత ఆయనది. కొంతకాలం ఆంజినేయ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా కూడా సేవలందించారు. రెడ్డెప్పనాయుడు మరణవార్త తెలుసుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రెడ్డెప్ప నాయుడు కుమారుడు వాసుదేవనాయుడు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్రమోహన్రెడ్డి తదితరులు ఉన్నారు.

చెర్లోపల్లిలో శతాధిక వృద్ధుడి మృతి