
దృఢత్వానికి ప్రతీక భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్
కేవీబీపురం: నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీకగా భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ నిలుస్తుందని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సి.ఛాయాపతి తెలిపారు. గురువారం కేవీబీపురం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్టీల్ అండ్ సిమెంట్ అధినేత వెంకటరత్నం ఆధ్వర్యంలో తాపీ మేస్త్రిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ టెక్నికల్ మేనేజర్ సి.ఛాయాపతి మాట్లాడుతూ జర్మనీ టెక్నాలజీ, రోబోటెక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంటును ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు. టెంపర్ ప్రూఫ్ బస్తాలతో మార్కెట్లోకి వస్తుండడంతో తూకం తగ్గే అవకాశం కూడా ఉండదన్నారు. సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. అనంతరం భారతి సిమెంటుకు సంబంధించిన నాణ్యత ప్రమాణాలు, విశిష్టత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంటు తయారవుతున్న విధానం, భవన నిర్మాణ కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం భారతి సిమెంట్ ప్రతిచోట అందుబాటులో ఉండేలా డీలర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద బీమా పత్రాలను అందించారు.