
వైఎస్సార్సీపీ కార్యకర్తపై కక్ష సాధింపు
కలువాయి(సైదాపురం): మండలంలోని తెలుగురాయపురం గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త పబ్బు వెంకటసుబ్బయ్య పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీసులు వెంకటసుబ్బయ్య ఇంటి వద్ద గాడి తవ్వించారు. బాధితుడు మాట్లాడుతూ తన ఇంటి ముందు సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా గాడి తవ్వించి రాకపోకలకు అంతరాయం కలిగించినట్టు తెలిపారు. రెవెన్యూ, ఎంపీడీ అధికారుల సమక్షంలోనే తెలుగు తమ్ముళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు గాడి తీయించారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తన ను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు వాపోయారు.
అందుబాటులోకి హైవే
తిరుపతి అర్బన్: నాయుడుపేట–చిత్తూరు హైవే, తిరుపతి–చైన్నె హైవే రోడ్డు పనులు పూర్తికావడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పాయి. నాయుడుపేట–చిత్తూరు హైవే మార్గంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేశారు. మరోవైపు రైల్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని గురువారం కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.