కూటమి పాలనలో తప్పని తిప్పలు | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో తప్పని తిప్పలు

May 30 2025 1:19 AM | Updated on May 30 2025 1:19 AM

కూటమి

కూటమి పాలనలో తప్పని తిప్పలు

ప‘రేషన్‌’

తిరుపతి జిల్లా వ్యాప్తంగా 5.9 లక్షల రేషన్‌ కార్డుదారులు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు. గత ప్రభుత్వంలో వారందరికీ ఇంటి వద్దకే రేషన్‌ అందించే వారు. దీని కోసం 369 మొబైల్‌ రేషన్‌ డెలివరీ (ఎండీయూ) వాహనాలను సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎండీయూ వాహనాలను రద్దు చేసింది. కార్డుదారులు గ్రామాలు విడిచి పక్క గ్రామాల్లో ఉన్న రేషన్‌ డీలర్ల వద్దకు వెళ్లి రేషన్‌ తెచ్చుకోవాల్సి వస్తోంది.

దూరమైన ఆరోగ్య సేవలు

కూటమి ప్రభుత్వంలో పల్లె ఆరోగ్యం పడకేసింది. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లలో వైద్యులను తొలగించి నర్సులకు బాధ్యతలు అప్పగించింది. మొబైల్‌ క్లినిక్‌ల ఊసే లేకుండా చేసింది. దీంతో దీర్ఘకాలిక రోగులు అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం మందుల కోసం గ్రామాలను విడిచి మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వలంటీర్‌ వ్యవస్థ రద్దు

కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటరీ వ్యవస్థకు మంగళం పాడేసింది. వలంటీర్ల సేవలను ఉపయోగించుకోవడమే కాకుండా వేతనాలు కూడా పెంచుతామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక వారిని అడ్డగోలుగా తొలగించింది. ప్రతి ఇంటా సంక్షేమ వెలుగులను నింపిన సేవకులను దూరం చేసింది.

కూటమి పాలనలో తప్పని తిప్పలు1
1/4

కూటమి పాలనలో తప్పని తిప్పలు

కూటమి పాలనలో తప్పని తిప్పలు2
2/4

కూటమి పాలనలో తప్పని తిప్పలు

కూటమి పాలనలో తప్పని తిప్పలు3
3/4

కూటమి పాలనలో తప్పని తిప్పలు

కూటమి పాలనలో తప్పని తిప్పలు4
4/4

కూటమి పాలనలో తప్పని తిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement