తెలంగాణకు రెండు భారీ పెట్టుబడులు | Sakshi
Sakshi News home page

తెలంగాణకు రెండు భారీ పెట్టుబడులు

Published Tue, Oct 27 2020 3:38 PM

Two Huge Investments to Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు భారీ పెట్టుబడులు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా కంపెనీల ప్రతినిధులు కలిశారు. సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు పెడతామని రెండు కంపెనీల ప్రతినిధులు ప్రకటించారు. తమ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్ల కోసం గ్రాన్యూల్స్‌ ఇండియా రూ.400 కోట్లు, లారస్‌ ల్యాబ్స్‌ రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. 

చదవండి: 

Advertisement
Advertisement