బీసీ జనగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతు ల్లో కులాల వారీగా జనగణన ప్రక్రియ చేపట్టే లా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. దీని పై అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి, కేంద్రానికి సమర్పించాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు గురువారం శ్రీనివాస్గౌడ్ లేఖ రాశారు. బీసీలకు విద్య, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల అమలులో బీసీ జనగణన కీలకమని పేర్కొన్నారు.