TS Governor Tamilisai Soundararajan Serious Comments On TS CS Santhi Kumari - Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఎస్‌పై తమిళిసై ఫైర్‌.. ఢిల్లీ కన్నా రాజ్‌భవన్‌ దగ్గర కదా అంటూ..

Mar 3 2023 12:34 PM | Updated on Mar 3 2023 1:00 PM

Tamilisai Soundararajan Serious Comments On TS CS Santhi Kumari - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలంగాణ చీఫ్ సెక్రెటరీ (CS) శాంతికుమారిపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. సుప్రీం కోర్టులో తనపై వేసిన రిట్ పిటిషన్‌పై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

దీనిపై గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక.. ఒక్కసారి కూడా రాజ్‌భవన్‌కి రాలేదన్నారు. మర్యాదపూర్వకంగా తనను కలువలేదన్నారు. అధికారింగా కూడా రాలేదు.. ప్రోటోకాల్ లేదు. కనీసం ఆమె ఫోన్‌లో కూడా మాట్లాడలేదని సీరియస్‌ అయ్యారు. ఢిల్లీ కన్నా రాజ్‌భవన్‌ దగ్గరగా ఉందంటూ సెటైరికల్‌ పంచ్‌ ఇచ్చారు. ఈ ట్వీట్‌ని శాంతికుమారికి ట్యాగ్ చేశారు.

ఈమధ్యే సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న శాంతికుమారి.. గవర్నర్ ముందు.. 10 బిల్లులు పెండింగ్ ఉన్నాయనీ.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించేలా చెయ్యాలని కోరుతూ సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు. 5 నెలలు గడిచినా బిల్లుల్ని గవర్నర్ ఆమోదించలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొనడం సంచలనంగా మారింది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement