ఎక్కడెక్కడ ఏ పంటలు వేయాలి?  | Singireddy Niranjan Reddy Conducted The Review On What crops Should Be Planted | Sakshi
Sakshi News home page

ఎక్కడెక్కడ ఏ పంటలు వేయాలి? 

Oct 1 2021 3:01 AM | Updated on Oct 1 2021 3:02 AM

Singireddy Niranjan Reddy Conducted The Review On What crops Should Be Planted - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి పంటల ప్రణాళికపై ప్రభుత్వ కసరత్తు మొదలుపెట్టింది. ఎక్కడెక్కడ ఏయే పంటలు వేయాలనే దానిపై వ్యవసాయ అధికారులతో గురువారం హాకాభవన్‌లో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేయా లనే దానిపై మంత్రి ప్రధానంగా చర్చించారు. ఎంత విస్తీర్ణంలో వేయాలి? మార్కెట్‌లో పంట ల డిమాండ్‌ ఎలా ఉంది అనే దానిపై వ్యవసాయనిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో మంత్రి ఆరా తీశారు.

ఈ అంశాలపై సీఎం కేసీఆర్‌కు ఇచ్చే తుది నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కోటేశ్వర్‌రావు, ఉపకులపతి ప్రవీణ్‌రావు, ప్రత్యేక కమిషనర్‌ హన్మంతు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, ఉద్యానశాఖ డైరెక్టర్‌ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement