దుబాయ్‌లో భర్త.. కన్నుమూసిన ఏడు నెలల గర్భిణి | pregnancy woman died in jagtial | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో భర్త.. కన్నుమూసిన ఏడు నెలల గర్భిణి

Jul 24 2024 11:29 AM | Updated on Jul 24 2024 11:33 AM

pregnancy woman died in jagtial

ముస్తాబాద్‌(సిరిసిల్ల): కడుపులో పెరుగుతున్న బిడ్డను కళ్లారా చూడకుండానే ఓ గర్భిణి అనారోగ్యంతో మృతిచెందింది. గ్రామస్తులు, కుటుంబీకుల కథనం మేరకు.. ముస్తాబాద్‌ మండలం మద్దికుంటకు చెందిన ఝాన్సీ అలియాస్‌ ఐశ్వర్య (20)కు గూడెం గ్రామానికి చెందిన ఈడుగురాళ్ల అంజయ్య, విజయ దంపతుల కుమారుడు హరీశ్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. 

ఝాన్సీ ప్రస్తుతం 7 నెలల గర్భిణి. ఇటీవలే భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లాడు. ఝాన్నీ అనారోగ్యానికి గురికాగా నెల రోజులుగా వైద్యం చేయిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. పెళ్లయిన ఏడాదిన్నరకే ఝాన్సీ మృతిచెందడంతో రెండు కుటుంబాలు దుఃఖంలో మునిగాయి. ఆమె కడసారి చూపునకు భర్త  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement