TRS MLA Padma Devender Reddy: ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం..

Medak: TRS MLA Padma Devender Reddy Narrowly Missed Accident - Sakshi

సాక్షి, మెదక్‌: మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. అక్కన్నపేట రైల్వే గేట్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును వెనకాల నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో పద్మాదేవేందర్ రెడ్డి వాహంలోనే ఉన్నారు. అయితే వాహనం వెనుకనుంచి వచ్చి ఢీకొట్టడంతో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసమైంది. మెదక్ పర్యటన అనంతరం రామాయంపేటలో జరిగే పెళ్లికి హాజరు కావడానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. 
చదవండి: రూ.3 వేలకు కొని రూ.12 వేలకు విక్రయం.. 410 కిలోల గంజాయి స్వాధీనం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top