Hyderabad: కోడలితో అఫైర్‌.. ప్రాణం తీసింది | A Man End Life In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: కోడలితో అఫైర్‌.. ప్రాణం తీసింది

Jun 28 2025 1:46 PM | Updated on Jun 28 2025 1:46 PM

A Man End Life In Hyderabad

పంచాయితీ భయంతో యువకుడి ఆత్మహత్య

కుషాయిగూడ(హైదరాబాద్ ): వరుసకు కోడలయ్యే యువతితో సన్నిహితంగా ఉన్నాననే విషయం బయట పడిందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చర్లపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లికి చెందిన పంగా భానుచందర్‌ (30) బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి పెయింటింగ్‌ వర్క్‌ చేస్తున్నాడు. దమ్మాయిగూడకు చెందిన పెయింటింగ్‌ కాంట్రాక్టర్, వరుసకు బావ అయ్యే వ్యక్తి వద్ద పని చేస్తూ చర్లపల్లి ఐజీ కాలనీలో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. 

ఈ క్రమంలో బావ కూతురితో పరిచయం పెరిగి ఆమెకు సన్నిహితమయ్యాడు. విషయం తెలిసిన బాధితురాలి తండ్రి, అతడి భార్య గురువారం రాత్రి భానుచందర్‌కు ఫోన్‌ చేసి మందలించారు. ఈ విషయమై శుక్రవారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టామని భార్యాభర్తలిద్దరూ హాజరు కావాలని చెప్పినట్లు మృతుడి భార్య పోలీసులు అందించిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో భానుచందర్‌ శుక్రవారం పిల్లలను స్కూల్‌ పంపి పంచాయితీకి వెళ్దామంటూ భార్యకు చెప్పడంతో ఆమె స్నానానికి వెళ్లింది. 

దీంతో బాత్రూం బయట నుంచి గడియ పెట్టిన భానుచందర్‌.. నలుగురిలో తన పరువు పోతుందన్న భయంతో ఇంట్లోనే సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. బాత్రూం తలుపులు ఎంతకీ తెరుచుకోకపోవడంతో గట్టిగా అరిచింది. ఆమె అరుపులు విన్న ఇరుగు పొరు గు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా భానుచందర్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న భానుచందర్‌ను కిందికి దింపి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement