యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు | Huge Devotees Rush In Yadadri Temple | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

May 30 2022 1:47 AM | Updated on May 30 2022 10:17 AM

Huge Devotees Rush In Yadadri Temple - Sakshi

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మాధవి దేవికి లడ్డూ ప్రసాదం అందజేస్తున్న ఇన్‌చార్జ్‌ ఈఓ

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఇంటర్, పదోతరగతి పరీక్షలు పూర్తి కావడంతో భక్తులు ఒక్క సారిగా పెరిగారు.  40వేలకు పైగా భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకోవడంతో ధర్మ దర్శనానికే 4 గంటల సమయం పట్టిం దని భక్తులు తెలిపారు.

వివిధ పూజల ద్వారా స్వామి వారికి రూ.45,50,079 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు. మరోవైపు స్వామివారిని  రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మాధవి దేవి కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం దర్శిం చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement