6 నెలల్లో మళ్లీ పాత పోస్టింగులు! | Huge collection during DPC and promotions of employees | Sakshi
Sakshi News home page

6 నెలల్లో మళ్లీ పాత పోస్టింగులు!

Feb 19 2026 4:25 AM | Updated on Feb 19 2026 4:25 AM

Huge collection during DPC and promotions of employees

దేవాదాయ శాఖలో అవినీతి ఆరోపణలున్న ఉద్యోగులకు అందలం 

ఉద్యోగుల డీపీసీ, పదోన్నతుల వేళ భారీగా వసూళ్ల పర్వం 

మంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తూ బదిలీలు 

సాక్షి, హైదరాబాద్‌: ఆరోపణలు గుప్పుమనటంతో ఆ ఉద్యోగులను ఏళ్ల తర్వాత మరోసీటుకు మార్చాల్సి వచ్చింది. ప్రతి ఫైలుకు ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారని స్వ యంగా ఉద్యోగులు లబోదిబోమనటంతో ప్రాధాన్యం లేని కుర్చీకి మార్చారు. కానీ ఆరు నెలల్లోనే మళ్లీ పాత కుర్చీలో కూర్చోబెట్టారు. అవినీతి, విచ్చలవిడి తనానికి కేంద్రంగా ఉన్న దేవాదాయ శాఖలో తాజా బా గోతం ఇది. అవినీతి ఆరోపణలున్న ఉద్యో గులను బదిలీ చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు రావటంతో బదిలీ చేసి, మళ్లీ ఆరు నెలలు తిరక్కుండానే పాత విభాగాన్ని అప్పగించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

సరిగ్గా అధికారుల డీపీసీ, పదోన్నతుల వ్యవహా రం జరుగుతున్నప్పుడే ఈ మార్పు చోటు చే సుకోగా.. పదోన్నతులకు ఫైళ్లు సిద్ధం చే సేందుకు భారీ మొత్తంలో డబ్బులు వసూ లు చేస్తున్నారని, అందుకే ఆరు నెలల్లోనే మళ్లీ బదిలీలు చేసి అవినీతి ఆరోపణలున్న ఉద్యోగులను మళ్లీ వారికి నచ్చిన చోటుకు మార్చారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.  

ఏళ్లుగా వివాదాస్పదంగా.. 
దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కొన్ని సెక్షన్లు ఏళ్లుగా వివాదాస్పదంగా మారాయి. పలుకుబడి ఉన్న కొందరు ఉద్యోగులు ఆ సెక్షన్లకు అంటుకుపోయారు. ఫైలు కదలాలంటే రూ.5 వేలు ముట్టచెప్పాల్సిందేనన్నది ఆ సెక్షన్లపై ఉన్న ఆరోపణ. పనిని బట్టి డబ్బులు వసూలు చేస్తారనే ఫిర్యాదులున్నాయి. 

విషయం దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి రావటంతో ఆ ఉద్యోగులను మార్చాలని మౌఖికంగా ఆదేశించారు. దీంతో ఆరు నెలల క్రితం ప్రక్షాళన చేపట్టి ప్రధాన విభాగాల సిబ్బందిని కొందరిని మార్చారు. రెండో విడతలో మిగతా వారిని మార్చాలని నిర్ణయించారు. కానీ, ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చిన మిగతా ఉద్యోగులకు మార్పు లేకుండా చేసుకున్నారు.  

తొలుత ఉన్నతాధికారి.. తర్వాత ఉద్యోగులు 
అవినీతి ఉద్యోగులను మార్చే క్రమ ంలో.. గత ప్రభుత్వ హయాంలో దేవా దాయ శాఖ కమిషనర్‌గా వ్యవహరించిన అనిల్‌కుమార్‌ ఓ ఉన్నతాధికారిపై వేటు వేశారు. బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసే తరుణంలో ఆలయాల నుంచి కూడా వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ అధికారిని అప్రధాన్య పోస్టులోకి మార్చారు. అయితే మరో కమిషనర్‌ వచ్చాక ఆ అధికారి పోస్టు మారింది. అంతేకాదు ఇటీవల ఉన్నట్టుండి ఆయన్ను కీలక పోస్టులోకి తెచ్చారు. 

గతంలో సెక్షన్లలో వసూళ్ల బ్యాచ్‌ ఆయన కనుసన్నల్లో నడిచేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఆ ఉన్నతాధికారి కీలక పోస్టులోకి రాగానే, సెక్షన్లలో ఆరు నెలల క్రితం జరిగిన బదిలీలను మార్చి మళ్లీ కొత్త పోస్టింగులు ఇచ్చేయడం గమనార్హం. దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో జరుగుతున్న ఈ తరహా వ్యవహారాలపై దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయానికి సమాచారం ఉండటం లేదని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement