నిషేధిత భూములపై రిజిస్ట్రేషన్ శాఖ వర్గాల్లో ఆందోళన
కలెక్టర్లు జాబితా సిద్ధం చేసినా వ్యవసాయేతర భూములను ఆన్లైన్ చేయని ప్రభుత్వం
జాబితాలో తప్పులుంటే మొదటికే మోసం వస్తుందనే భావన
క్షేత్రస్థాయిలో ఇబ్బంది రాకుండా మరోమారు పరిశీలించే యోచన
ఈ జాబితాలో 90 లక్షలకు పైగా ఎకరాలు నమోదు చేసిన కలెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: ‘అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) సర్టిఫికెట్లు ఇచ్చిన భూములను కూడా ప్రభుత్వ భూములుగా నోటిఫై చేశారు. ఎల్ ఆర్ఎస్, భవన నిర్మాణ అనుమతులు ఉండి ఆక్యు పెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ) ఉన్న భూములను కూడా మళ్లీ నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. పదుల సంఖ్యలో లావాదేవీలు జరిగిన భూము లనూ 22(ఏ) కింద చేర్చారు. గతంలో 22ఏ జాబి తాలో చేర్చడమే అన్యాయమంటూ కోర్టుకెళ్లిన వారి భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని ఇప్పటికే న్యాయస్థానాలు ఆదేశించిన భూములను కూడా మళ్లీ అదే జాబితాలో పొందుపరిచారు.
వెంచర్లు వేసి అమ్మేసిన భూములు భూదాన్వంటూ భవిష్యత్తు లావాదేవీలు జరగకుండా నిషేధం విధించారు..’ ఇవీ జిల్లా కలెక్టర్లు రెండు నెలల క్రితం రూపొందించిన నిషేధిత భూముల (22ఏ) జాబితాలోని వ్యవసాయేతర భూముల విషయంలో వస్తున్న ఫిర్యాదులు. కాగా ఈ జాబితా కారణంగా కొత్త తలనొప్పులు ప్రారంభమవుతాయనే ఆందోళన రిజిస్ట్రేషన్ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఇంకా కార్డ్ సాఫ్ట్వేర్లోకి రాలేదు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు ఇటీవల రూపొందించిన నిషేధిత భూముల జాబితా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. వ్యవసాయ భూముల నిషేధిత జాబితాను ఆన్లైన్లో నమోదు చేసిన ప్పటికీ వ్యవసాయేతర భూములను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో నమోదు చేయలేదు. ఈ జాబితాకు సంబంధించిన ప్రతిపాదనలపై ఫిర్యా దులు వస్తున్న నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ జాబితాలను ఇంకా తమకు సంబంధించిన కార్డ్ సాఫ్ట్వేర్ పరిధిలోకి తీసుకురాలేదు.
ఈ నేపథ్యంలో ఈ జాబితాను ఆన్లైన్లో యథావిధంగా పొందుపరిచే విషయంలోనూ సమీక్ష జరపా లని, ఇందులో తప్పులుంటే మొదటికే మోసం వస్తుందనే భావనతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా మరోమారు ఈ జాబితాలను పరిశీ లించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
ఎక్కువగా అటవీ, తర్వాత భూదాన్ భూములు
రెండు నెలల క్రితం జిల్లాల కలెక్టర్లు రూపొందించిన నిషేధిత భూముల జాబితాలో రాష్ట్రం మొత్తం మీద 90 లక్షలకు పైగా ఎకరాల భూమిని చేర్చినట్టు తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా అటవీ భూము లున్నట్టు సమాచారం. ఆ తర్వాత రెవెన్యూ, భూదా న్ భూములున్నాయని, గతంలో కంటే భూదాన్ భూముల విస్తీర్ణం నిషేధిత జాబితాలో పెరిగిందని రెవెన్యూ వర్గాలంటున్నాయి.
అయితే, ఇంకా భూదాన్ భూములు తక్కువగా నమోదు చేశారనే ఆలోచనలో ఉన్నతాధికారులున్నారని, ప్రస్తుత జాబితాలో 75 వేలకు పైగా ఎకరాలను చేర్చగా, కనీసం 2 లక్షల ఎకరాల మేరకు భూదాన్ భూము లుంటాయనే అంచనాలో రెవెన్యూ యంత్రాంగం ఉందని తెలుస్తోంది.
మరోవైపు గతంలో తయారు చేసిన నిషేధిత జాబితాలో భూముల విస్తీర్ణాన్ని సరిగా పేర్కొనలేదని, చాలాచోట్ల సర్వే నంబర్లు మాత్రమే ప్రస్తావించి విస్తీర్ణం నమోదు చేయలేదని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అలాచేస్తే ఆ సర్వే నంబర్లలోని భూమి అంతా నిషేధిత జాబితాలోకి వెళ్లేదని, కొత్త జాబితాలో సర్వే నంబర్లతో పాటు భూమి విస్తీర్ణాన్ని పక్కాగా నమోదు చేసిన నేపథ్యంలో ఈ సమస్యకు కొంత మేరకు చెక్ పడిందని చెపుతున్నారు.


