బ్లడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు సహకరించాలి 

Collector Sharman Says Everyone Donate And Cooperate In Setting Up Blood Center Under Indian Red Cross Society - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్‌ సెంటర్‌  ఏర్పాటుకు అందరు  విరాళాలిచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ అన్నారు. బుధవారం  రెడ్‌ క్రాస్‌ ప్రతినిధులు కలెక్టర్‌ ను కలిసి బ్లడ్‌ సెంటర్‌ ఏర్పాటు, పనుల పురోగతిపై వివరించారు. ఈ సందర్భంగా దాతలు లారెన్స్‌ మాయో ఆప్టికల్స్‌ ఆఫీస్‌ కంప్యూటర్లను విశాల్‌ పెరిఫెరెల్స్, కలర్‌ ప్రింటర్‌ ను, డా. శ్యాంకాంత్‌ బసాకే రూ. 7500 చెక్కులను రెడ్‌ క్రాస్‌ సొసైటీకి విరాళంగా  కలెక్టర్‌ కు అందజేశారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్‌ఓ సూర్యలత, జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ భీం రెడ్డి, రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు, రాధా కృష్ణ,, డా. సిసా తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top