తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీలు.. తొందరగా తేల్చాలని కేంద్రం పిటిషన్‌

Central Govt Went To High Court On Issue Of IPS And IAS Transfers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీల అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీల  విచారణను అ‍త్యవసరంగా చేపట్టాలని కేంద్రం.. తెలంగాణ హైకోర్టును కోరింది. ఈ క్రమంలో జూన్‌ 5వ తేదీన విచారిస్తామని హైకోర్టు స్పష్టం​ చేసింది. 

కాగా, రాష్ట్ర విభజన తర్వాత 14 మంది ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులను కేంద్రం.. ఏపీ, తెలంగాణకు కేటాయించింది. అయితే, కేంద్ర ఉత్తర్వులపై క్యాట్‌ను ఆశ్రయించి అధికారులు ఎక్కడికక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాట్‌ ఉత్తర్వులపై కేంద్రం.. హైకోర్టుకు వెళ్లింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో సోమేష్‌ కుమార్‌ ఏపీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న డీజీపీ అంజనీ కుమార్ సహా 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top