సాక్షి, హైదరాబాద్: ఈ రోజు మంగళవారం ఏసీబీ అధికారులు హైదరాబాద్ జలమండలి జీఎం అనంతకుమార్ ఇంట్లో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో రూ.కోటి ఐదు లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కేజీకి పైగా బంగారంతో పాటు నిజామాబాద్లో మూడు ఎకరాల భూమి ఇతర స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించారు. వీటన్నిటి విలువ దాదాపు. రూ. 100 కోట్లు ఉన్నట్లుగా తెలిపారు. అదే విధంగా అనంత కుమార్ బ్యాంక్ లాకర్స్ సైతం పెన్ చేసి తనిఖీ చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జేడీఎంతో పాటు అతని బంధువల ఇంట్లోనూ ఏకకాలంలో తనిఖీలు జరిపారు. రెడ్ హిల్స్లోని జీఎం నివాసంతో పాటు మల్లాపూర్లోని నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.


