వేలూరు: రాణిపేట జిల్లా వాలాజపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో వందకు పైగా కుటుంబాలు నివశిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో అవసరమైన కనీస వసతులు కల్పించలేదు. బుధవారం ఉదయం ఆ వార్డులోని వారందరూ ఇంటిపై నల్ల జెండాలు కట్టి నల్ల దుస్తులు ధరించి తమకు కనీస వసతులు కల్పించాలని నిరసన తెలిపారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వసతులు కల్పించాలని లేకుంటే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించి తమ ఓటరు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులను జిల్లా ఎన్నికల అధికారికి అప్పగించడంతో పాటు పోలింగ్ బూత్ వద్ద తమ ప్రాంత వాసులతో నిరసన తెలియజేస్తామన్నారు.


