బాధ్యతల స్వీకరణ
కొరుక్కుపేట: తమిళనాడు అండ్ పుదుచ్చేరి నావికా ప్రాంతం (ఫోట్నా)గా రియర్ అడ్మిరల్ ఉపల్కుందు బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఐఎన్ఎస్ అడయార్లో జరిగిన ఒక పరేడ్లో రియర్ అడ్మిరల్ సతీష్ షెనాయ్ నుంచి తమిళనాడు, పుదుచ్చేరి నావికా ప్రాంతం (ఫోట్నా) ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్గా రియర్ అడ్మిరల్ ఉపల్ కుందు బాధ్యతలు స్వీకరించారు. దేశానికి 40 సంవత్సరాల విశిష్ట సేవ చేసిన తర్వాత రియర్ అడ్మిరల్ సతీష్ షెనాయ్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఫోట్నాగా ఉపల్ కుందు బాధ్యతలను స్వీకరించారు. సీనియర్ నౌకా దళ అధికారులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రి యర్ అడ్మిరల్ సతీష్ షెనాయ్ను ,వారి విశిష్ట సేవ కు ఘనంగా సత్కరించారు. రియర్ అడ్మిరల్ ఉపల్ కుందుకు కొత్త ఫోట్నాగా స్వాగతం పలికారు.


