
క్లుప్తంగా
తిరుత్తణి హుండీ ఆదాయం
రూ.1,43 కోట్లు
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్యణ్యస్వామి ఆలయ హుండీ ఆదాయం 31 రోజులకుగాను రూ.1,43 కోట్లు వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు. ప్రతినెలా కృత్తిక తరువాత హుండీల కానుకలు లెక్కిస్తారు. ఆ మేరకు పెరటాసి కృత్తిక తరువాత గురువారం హుండీ కానుకలను లెక్కించారు. ఆలయ చైర్మన్ శ్రీధరన్, జాయింట్ కమిషనర్ రమణి సమక్షంలో హుండీలు తెరిచి కానుకలు లెక్కింపులో వందకు పైగా ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. లెక్కింపులో నగదుగా రూ.1.43కోట్లు, 214 గ్రాముల బంగారం, 10,428 గ్రాముల వెండిని భక్తులు కానుకగా సమర్పించినట్లు ఆలయ జాయింట్ కమిషనర్ రమణి తెలిపారు. ఈ మొత్తం ఆలయ బ్యాంకు ఖాతాలో జమచేసినట్లు పేర్కొన్నారు.
2,500 మందికి
సహాయకాల పంపిణీ
కొరుక్కుపేట: తిరువొత్తియూర్లో డీఎంకే ఆధ్వర్యంలో సంక్షేమ సహాయకాలు పంపిణీ చేశారు. మంత్రి శేఖర్బాబు నిర్వహించిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పాల్గొ ని సహాయకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ చైన్నె తూర్పు జిల్లా సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపారు. పార్టీ కార్యనిర్వాహకులు 2026 ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. నెల రోజులుగా సీఎం స్టాలిన్ ఆదేశం మేరకు తను తమిళనాడులోని వివిధ జిల్లాలకు, ప్రతిరోజూ ఒక నియోజకవర్గానికి వెళుతున్నానని చెప్పారు. అక్కడి జిల్లా కార్యనిర్వాహకులందరితో సమావేశమై చర్చలు జరుపుతున్నానని చెప్పారు. దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
రేపటి నుంచి
పార్శిల్ సర్వీస్ నిలిపివేత
కొరుక్కుపేట: కాలుష్యం కారణంగా చైన్నె ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో మొదటి పార్శిల్ సర్వీస్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ఈ విషయంలో, దక్షిణ రైల్వే చైన్నె డివిజన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీపావళి రద్దీని దృష్టిలో ఉంచుకుని, చైన్నె డివిజన్లో 176 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపారు. రద్దీని నియంత్రించడానికి భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ప్రయాణికుల బుకింగ్కు అంతరాయం కలిగింది. ప్రధాన రైల్వే స్టేషన్లలో తాత్కాలిక షెల్టర్లు, కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. ప్యాసింజర్ రైళ్లకు అదనపు సిబ్బందిని కేటాయించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, చైన్నె ఎగ్మోర్లోని ఎగ్మోర్ రైల్వే స్టేషనన్లో పార్శిల్ సర్వీస్ అక్టోబర్ 18 నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు రద్దు చేశారు. ఇంకా, పత్తితో సహా మండే వస్తువులు తీసుకెళుతున్నారో లేదో తెలుసుకోవడానికి చైన్నెలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో స్నిఫర్ డాగ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనిని దక్షిణ రైల్వే సీనియర్ అధికారులు పరిశీలించారు.
మెట్రో స్టేషన్లో
బుక్ పార్క్ ప్రారంభం
అన్నానగర్: పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడానికి తమిళనాడు పాఠ్యపుస్తకం, విద్యా సేవల కార్పొరేషన్ ఆధ్వర్యంలో చైన్నె సెంట్రల్ మెట్రో రైల్వేస్టేషన్లో రూ.1.85 కోట్ల వ్యయంతో చైన్నె బుక్ పార్క్ ఏర్పాటు చేశారు. ఈ బుక్ పార్క్ మెట్రోస్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేశారు. దీన్ని జూన్ 10న ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించారు. విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ పార్క్లో 10 మంది ప్రచురణకర్తల పుస్తకాలు అమ్మకానికి ఉన్నాయి. అదనంగా, తమిళనాడు టెక్ట్స్బుక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కార్పొరేషన్ పబ్లిషింగ్ హౌస్ తరఫున పుస్తకాలు కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఇప్పటివరకు సుమారు 50 వేల మంది ఈ బుక్ పార్క్ను సందర్శించారని, వారిలో ఎక్కువ మంది తమకు కావలసిన పుస్తకాలను కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం, మరో 3 ప్రచురణకర్తలు పుస్తకాలను విక్రయించడానికి దరఖాస్తు చేసుకుని అనుమతి పొందారు.
మోసం కేసులో దంపతుల అరెస్ట్
అన్నానగర్: మహిళను మోసం చేసి 360 సవర్ల నగలు కాజేసిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. పెరంబలూరు జిల్లా లెప్పకుడికాడు జమాలియా నగర్కు చెందిన బషీర్అహ్మద్. ఇతని భార్య ఉమ్మల్ బజారియా (53). ఈమె పెరంబలూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదర్శ్ బసేరాకు ఫిర్యాదు చేశారు. అందులో తన భర్త బషీర్ అహ్మద్ దుబాయ్లో డ్రైవర్. వారికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. 2006లో లైప్పె కుడికాడుకు చెందిన బాజిలుల్ రెహమాన్ (52), భార్య పర్వీన్ భాను (46) తన కుటుంబంతో కలిసి అతని సొంత ఇంటిని అద్దెకు తీసుకున్నారు. బాగా పరిచయం ఏర్పడి నమ్మకం కుదరడంతో అతని నుంచి అవసరాల కోసం 360 సవర్ల నగలు తీసుకున్నారు. నగలు తిరిగి ఇవ్వకుండా వారిని బెదిరిస్తున్నారు. కాబట్టి, నగలు అందుకుని నన్ను తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన పర్విన్ భాను, భర్త బాజిలుల్ రెహమాన్, కుమార్తెలు ఆఫ్రిన్ బాను, నస్రీన్ బాను, హయత్ బాహ్సా, సారథిలపై చర్యలు తీసుకోవాలని, నగలను తిరిగి ఇవ్వాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దంపతులను శుక్రవారం అరెస్టు చేశారు.