
ముగిసిన పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. మూల విరాట్కు పవిత్ర మాలధారణతో విశేష పూజలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం యాగశాల నుంచి పవిత్రమాలలు విశేష పూజా ద్రవ్యాలను శ్రీకాళహస్తీశ్వరాలయ ఈఓ బాపిరెడ్డి, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయకుడికి పవిత్రమాల సమర్పించారు. అనంతరం వినాయకుడు, జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామికి పవిత్రమాలల సమర్పణ వేడుకగా చేపట్టారు. యాగశాలలో శాంతి హోమ పూజలు, చండికేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయన్నారు.

ముగిసిన పవిత్రోత్సవాలు