
నీట్ వ్యతిరేకత నిరసన (ఫైల్)
సాక్షి,చైన్నె : నీట్ను రద్దు చేయాలన్న నినాదం తమిళనాట మళ్లీ తెరమీదకు వచ్చింది. పీజీ కౌన్సెలింగ్లో కటాఫ్ మార్క్ సున్న అని జాతీయ వైద్య విద్యా కమిటీ ప్రకటించడాన్ని తమిళ పార్టీలు అస్త్రంగా చేసుకున్నాయి. నీట్ను రద్దు చేయాలని నేతలు పట్టుబట్టారు. ఆది నుంచి నీట్కు వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. తాజాగా పీజీ కౌన్సెలింగ్లో కటాఫ్ మార్కుల వ్యవహారంలో కేంద్ర వైద్య విద్యా కమిటీ చేసిన ప్రకటనను అస్త్రంగా చేసుకున్నారు. కటాఫ్ మార్కు సున్నాకు తగ్గించినట్టు, సున్న మార్కులు సాధించినా పీజీలో చేరవచ్చు అని తాజాగా వెలువడ్డ ప్రకటనను తమిళ పార్టీలు తీవ్రంగా పరిగణించాయి. నీట్ ఓ మోసపూరిత పరీక్ష అని, దీనిని రద్దు చేయాలని పట్టుబడుతూ నినాదాన్ని అందుకున్నారు. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ స్పందిస్తూ, నీట్ ఫలితం సున్న అన్నది ఇప్పటికై నా కేంద్రం గ్రహించినట్లుంద విమర్శించారు. కేవలం శిక్షణ కేంద్రాల కోసమే కేంద్రం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ పరీక్ష కారణంగా ఎందరో విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేస్తూ, ఇకనైనా ఈ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. క్రీడల శాఖ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ పేర్కొంటూ, నీట్ వ్యవహారంలో కేంద్రం అతి పెద్ద కుట్ర చేస్తున్నట్టు తాజాప్రకటన స్పష్టం చేసిందని ధ్వజమెత్తారు. పీఎంకే నేత అన్బుమణి రాందాసు స్పందిస్తూ, నీట్ కటాఫ్ మార్కు సున్నగా నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కోట్లు ఉన్న వారికే అర్హత అన్నట్టుగా కేంద్రం తీరు ఉందని మండి పడ్డారు. ఎండీఎంకే నేత వైగో మాట్లాడుతూ, ఇది మోస పూరిత పరీక్ష అని, ఇకనైనా అందరూ కలిసి కట్టుగా ఈ పరీక్షను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
కేంద్రం ఈ విషయాన్ని గ్రహించినట్లుందని సీఎం స్టాలిన్ ఎద్దేవా
తెరపైకి మరోసారి రద్దు డిమాండ్