
పండ్ల ప్రదర్శన అదుర్స్
పనస పండ్ల చేపలు
సేలం: నీలగిరి జిల్లా ఊటీ కున్నూరు స్విమ్స్ పార్కు 65వ పండ్ల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి వివిధ పండ్లతో పలురకాల ఆకృతులను తీర్చిదిద్ది ఉద్యాన వనవిభాగం కొలువుదీర్చింది. ఈనెల 26వ తేదీ వరకు ఈ ప్రదర్శనను సందర్శకులు తిలకించేందుకు అవకాశం కల్పించారు. ఈ ప్రదర్శనను నీలగిరి కలెక్టర్ లక్ష్మీభవ్య ప్రారంభించారు. నాలుగు టన్నుల వివిధ పండ్లను ఈ ప్రదర్శనకు ఉపయోగించారు. నిమ్మకాలతో ప్రవేశ మార్గం, ఆరెంజ్ పండ్లతో కప్, చెర్రీ పండ్లతో విజిల్, బత్తాయిలతో కారు, పనసతో చేప లు, మామిడిపండ్లతో పాము, ద్రాక్ష, స్ట్రాబెర్రీలతో ఐఎస్క్రీం, కేక్ వంటి ఆకృతులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

పండ్ల ప్రదర్శన అదుర్స్

పండ్ల ప్రదర్శన అదుర్స్

పండ్ల ప్రదర్శన అదుర్స్

పండ్ల ప్రదర్శన అదుర్స్

పండ్ల ప్రదర్శన అదుర్స్

పండ్ల ప్రదర్శన అదుర్స్