ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరి మృతి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరి మృతి

Jun 2 2023 1:00 AM | Updated on Jun 2 2023 1:00 AM

అన్నానగర్‌: ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. చైన్నె పెరుంగుడి నుంచి ఈసీఆర్‌ మీదుగా గురువారం వేకువజామున ఇద్దరు ద్విచక్రవాహనంలో పుదుచ్చేరి వైపు వెళుతున్నారు. ఆ సమయంలో పుదుచ్చేరి నుంచి చైన్నె వైపు మరో ద్విచక్రవాహనంలో ఓ వ్యక్తి వస్తున్నాడు. గురువారం ఉదయం 7 గంటలకు కల్పాక్కం సమీపంలోని పెరుందురావు ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయపడ్డారు. మహ్మద్‌ ఇబ్రహీం, మరొకరు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో బైకు నడుపుతూ వచ్చిన వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండగా చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల పూర్తి వివరాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement