విశేషంగా శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

విశేషంగా శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం

Jun 3 2026 1:21 AM | Updated on Jun 3 2026 1:21 AM

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మిసమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణం మంగళవారం విశేషంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం స్వామి అమ్మవార్లలను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం నీరాజన మంత్ర పుస్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement