మిర్యాలగూడకు అధిక నిధులు ఇవ్వాలి
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
మిర్యాలగూడలో ఆసియాలోనే పెద్ద రైస్ ఇండస్ట్రీ ఉందని.. ఈ ప్రాంతానికి అధిక నిధులు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మహిళలకు రుణాలు అందించి కోటీశ్వరులను చేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. మిర్యాలగూడ పెద్ద పట్టణమని ఇక్కడి ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని.. సోనియాగాంధీ తెలంగాణ దేవత అన్నారు. కాంగ్రెస్ మరో 20 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.


