
రక్తదానం ప్రాణదానంతో సమానం
కోదాడరూరల్ : రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని కోదాడ యునైటెడ్ ముస్లిం యూత్ ప్రతినిధులు అన్నారు. ఆదివారం మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజును పురస్కరించుకొని కోదాడలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 100 సభ్యులు రక్తాన్ని దానం చేసి ఖమ్మం నోవా కేర్ బ్లడ్ బ్యాంకుకు అందజేశారు. అనంతరం యూత్ ప్రతినిధులు మాట్లాడు తు యువత సమాజ సేవలో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ముస్లిం యూత్ నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.