
15న ఎంజీ యూనివర్సిటీ స్నాతకోత్సవం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవాన్ని సెప్టెంబర్ 15న నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించి శుక్రవారం యూనివర్సిటీలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపై పలు సూచనలు చేశారు. ముఖ్య అతిథులుగా ఛాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హాజరవుతారని తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో పీజీ విద్యార్థులకు 57 గోల్డ్ మెడల్స్, 22 మందికి పీహెచ్డీ పట్టాలను అందించనున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఈఓ ఉపేందర్రెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.