
చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం
కోదాడ రూరల్: చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం 65వ నంబర్ జాతీయరహదారిపై కోదాడ మండలంలోని రామాపురం క్రాస్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టును మంగళవారం ఆయన తనిఖీ చేసిన అనంతరం మాట్లాడారు. హైవేపై ప్రయాణించే ప్రతి వాహనాన్ని క్షుణ్టంగా పరిశీలించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోకి అక్రమంగా సన్నరకం వరిధాన్యం తీసుకురావద్దని, గోవులు, పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. చెక్పోస్టుల వద్ద సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెంట కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజితారెడ్డి, ఎస్ఐ అనిల్ ఉన్నారు.
సమస్యలు సామరస్యంగా
పరిష్కరించుకోవాలి
సూర్యాపేటటౌన్ : భూ సమస్యలు, తగాదాలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వ్యవసాయ భూమి హద్దులు, దారి, విస్తీర్ణం, నీటివనరులు లాంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతారని పేర్కొన్నారు. వీటిపై చాలా ఫిర్యాదులు నమోదవుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో రైతులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పరస్పరం భౌతిక దాడులకు పూనుకోవద్దని సూచించారు. పెద్ద మనుషుల సమక్షంలో సమస్యలను పరిశీలించుకోవాలన్నారు.
ఫ ఎస్పీ నరసింహ