
పాఠశాలల ప్రారంభానికి ముందే యూనిఫాం అందించాలి
నాగారం : పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థుల స్కూల్ యూనిఫాం కుట్టడం పూర్తిచేసి అందించాలని డీఈఓ అశోక్ సూచించారు. గురువారం నాగారం మండల కేంద్రంలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో సిచ్చింగ్ చేస్తున్న స్కూల్ యూనిఫామ్స్ను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు నమోదయ్యేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో బడిబాట నిర్వహించి బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ మారయ్య, ఎంఈఓ వాసం ప్రభాకర్, మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు.