వన మహోత్సవానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

వన మహోత్సవానికి సిద్ధం

May 30 2025 1:10 AM | Updated on May 30 2025 1:10 AM

వన మహ

వన మహోత్సవానికి సిద్ధం

తాళ్లగడ్డ (సూర్యాపేట) : గ్రామాల్లో పచ్చదనం పెంపునకు రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవాన్ని చేపట్టింది. ఈమేరకు ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను సిద్ధం చేశారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో జూన్‌లో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో 475 నర్సరీలు

ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 59 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 54లక్షల పైచిలుకు మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో మొత్తం డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో 475 నర్సరీలు ఉండగా ఈ నర్సరీల్లో మొత్తం 50.02లక్షల మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుతం 40.472 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. 10 లక్షల మొక్కలు విత్తు దశలో ఉన్నాయి. ఈ ఏడాది డీఆర్‌డీఒ ఆధ్వర్యంలో 28.87 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా మిగిలిన మొక్కలను వన మహోత్సవంలో భాగస్వాములుగా ఉన్న మరో 18 శాఖలకు మొక్కలు అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 5 నర్సరీలు ఏర్పాటు చేసి 2.439 లక్షల మొక్కలు పెంచి నాటేందుకు సిద్ధంగా ఉంచారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో 1.93 లక్షల మొక్కలు పెంచి నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా 54,39100 మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నారు.

మొక్కల సంరక్షణ బాధ్యత

ఈ సారి ఎక్కువగా పండ్లు, నీడ, పూలు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ప్రభుత్వ భూముల్లో ఇతర ప్రదేశాల్లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నాటిన మొక్కల సంరక్షణ ఉపాధిహామీ కూలీలు చూడనున్నారు. మున్సిపాలిటీల్లో మొక్కల సంరక్షణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించారు. అఽత్యధికంగా డీఆర్‌డీఓ 28.870 లక్షల మొక్కలు, తర్వాత స్థానంలో మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ 15.532 లక్షల మొక్కలు, అత్యల్పంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 4.5 వేల మొక్కలు నాటనున్నారు.

59లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

ఫ సిద్ధంగా ఉన్న 54లక్షల పైచిలుకు మొక్కలు

ఫ పండ్లు, నీడ, పూలు, ఔషధ మొక్కలకు ప్రాధాన్యం

ఫ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నాటనున్న అధికారులు

ఆయా శాఖల వారీగా నాటాల్సిన మొక్కల వివరాలు

అటవీ శాఖ 4,32,000

డీఆర్‌డీఏ 28,87,000

విద్యా శాఖ 45,000

రోడ్డు భవనాలు 50,000

నీటి పారుదల 2,57,000

వ్యవసాయ శాఖ 383,000

రెవెన్యూ 1,00,000

ఆబ్కారీ 94,900

మున్సిపల్‌ పరిపాలన,

పట్టణ అభివృద్ధి 15,53,000

వైద్య ఆరోగ్య 22,500

హోం శాఖ 47,600

పరిశ్రమలు 60,000

హార్టికల్చర్‌ 38,300

సాంఘిక సంక్షేమ 750

గిరిజన 10,000

బీసీ సంక్షేమ 450

మైనార్టీ సంక్షేమ 750

పశు సంవర్ధక శాఖ 750

నెలరోజుల్లో టార్గెట్‌ పూర్తిచేస్తాం

నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నాటడం ప్రారంభిస్తాం. నాటిన మొక్కలు సంరక్షించడానికి ట్రీ గార్డులు, వాచర్‌లను సిద్ధం చేశాం. అధికారుల ద్వారా ఖాళీ ప్రదేశాలను గుర్తించాం. గుంతలు తీయించి నెలరోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ను పూర్తిచేస్తాం.

– సతీష్‌, జిల్లా అటవీ శాఖ అధికారి

వన మహోత్సవానికి సిద్ధం1
1/1

వన మహోత్సవానికి సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement