నేడు సూర్యాపేటలో మంత్రి తుమ్మల సమీక్ష | - | Sakshi
Sakshi News home page

నేడు సూర్యాపేటలో మంత్రి తుమ్మల సమీక్ష

May 30 2025 1:10 AM | Updated on May 30 2025 1:10 AM

నేడు

నేడు సూర్యాపేటలో మంత్రి తుమ్మల సమీక్ష

నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి తదితర అంశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఈనెల 30న ఉదయం 10 గంటలకు సూర్యాపేట కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నట్లు ఆమె పేర్కొన్నారు.

నర్సరీల పరిశీలన

నేరేడుచర్ల : నేరేడుచర్ల మండలంలోని సోమారం, బురుగులతండా, బొడలదిన్న గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను గురువారం జెడ్పీ సీఈఓ అప్పారావు పరిశీలించారు. నర్సరీల నిర్వహణను గ్రామ పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. నేరేడుచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది, సెర్ఫ్‌ సిబ్బంది, మండల పరిషత్‌ సిబ్బందితో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీఓ సోమ సుందర్‌రెడ్డి, ఎంపీఓ నాగేందర్‌, ఏపీఎం శేఖర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు రమేష్‌, స్వరూప, పద్మ, ఫీల్డ్‌ అసిస్టెంట్లు సుజాత, రజిత, శోభన్‌ తదితరులున్నారు.

ఆధునిక వ్యవసాయ

పద్ధతులు పాటించాలి

పెన్‌పహాడ్‌: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలని వరి పరిశోధన సంస్థ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ శ్రీదేవి, కేవీకే శాస్త్రవేత్త సీహెచ్‌ నరేష్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని గాజులమల్కాపురం గ్రామంలో వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ, డ్రోన్‌ వినియోగం, వివిధ పంటల్లో చీడపీడల యాజమాన్య పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనిల్‌కుమార్‌, ఏఈఓ కిరణ్‌, లక్ష్మీనారాయణ, ఆయిల్‌పామ్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ నిఖిల్‌రెడ్డి, తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు సూర్యాపేటలో  మంత్రి తుమ్మల సమీక్ష 
1
1/1

నేడు సూర్యాపేటలో మంత్రి తుమ్మల సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement