సన్న బియ్యంపై లబ్ధిదారుల సంతృప్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుంచి ఆనందం వ్యక్తం అవుతోంది. సరిగ్గా వండుకుంటే సమస్యే లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. గంజి సరైన సమయంలో సరిగ్గా వార్చకపోతే కొద్దిగా ముద్ద అవుతోందని, అయినా పరవాలేదని సన్న బియ్యం పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త బియ్యం అయినందున కొన్నాళ్లు ఆగి వండుకుంటే మరింత బాగుంటుందని పేర్కొంటున్నారు. అక్కడక్కడ కొంతమేర నూకలు వస్తున్నా, దొడ్డు బియ్యంతో పోల్చితే సన్న బియ్యాన్ని పూర్తిగా వండుకొని తింటామని ప్రజలు చెబుతున్నారు. ఈ నెల మొదటి వారంలోనే సన్నబియ్యం సరఫరా అయ్యాయి. 90 నుంచి 60 శాతం మంది లబ్ధిదారులు బియ్యాన్ని ఇప్పటికే తీసుకెళ్లారు. తొలి మూడు, నాలుగు రోజులు లభ్దిదారులు షాపుల వద్ద బారులు తీరారు. సన్న బియ్యం చింట్లు, హెచ్ఎంటీలు రకంగా పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్నవి ఫోర్టిఫైడ్ సన్నబియ్యం అని చెబుతున్నారు. సన్న బియ్యంలో మూడు రకాల బియ్యం ఉన్నాయని, 30శాతం వరకు నూకలు, మెరిగెలు ఉన్నాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. బియ్యం తీసుకున్న ప్రతి ఒక్కరూ వండుకుంటున్నారు ఎక్కడా అమ్ముకోవడం లేదు. బియ్యంలో సుమారు 15 నుంచి 20 శాతం వరకు నూకలు ఉన్నట్లు లబ్ధిదారులు తెలుపుతున్నారు. బియ్యం తినడానికి వీలుగా ఉన్నట్లు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అన్నం బాగానే ఉంటుందని గంజి వార్చితే ఇంకా బాగుంటుందని మహిళలు చెబుతున్నారు. ఇదివరకు దొడ్డు బియ్యం ఇస్తుండడంతో తాము పిండి పట్టించడానికి ఇతర అవసరాలకు వాడుకున్నామని, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతో అన్నం వండుకొని తింటున్నట్లు పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. సన్న బియ్యం తీసుకున్న ప్రజలు ఆ బియ్యంతో ఏం చేస్తున్నారు.. గతంలో దొడ్డు బియ్యాన్ని ఇడ్లీ, దోశలకు వినియోగించినట్లుగానే వినియోగిస్తున్నారా? వాటిలా అమ్ముకునేందుకు ఆలోచన చేస్తున్నారా? లేదంటే తినేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారా? అనే అంశాలపై ‘సాక్షి’ గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపింది. లబ్ధిదారులతో మాట్లాడింది. మొత్తానికి సన్న బియ్యంను తాము తినేందుకే వినియోగిస్తామని ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్లో ప్రజలు ముక్తకంఠంతో చెప్పుకొచ్చారు.
ఇంకా సాగుతున్న పంపిణీ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం రేషన్ షాపులు 2122 ఉండగా, వాటి పరిధిలో 10,08,829 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా కార్డులపై ప్రతినెలా 1,75,70,855 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నెలలో సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. ఇందులో భాగంగా 1,92,12,855 కిలోల బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేయగా, ఇప్పటివరకు 1,44,47,914 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది. ఇంకా 31.22.941 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.
పేదలకు మేలు
సన్నబియ్యం పంపిణీతో పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో దొడ్డుబియ్యం పంపిణీతో దళారులకు లబ్ధిచేకూరేది. ఆ బియ్యాన్ని తినలేక చాలా మంది అమ్ముకునేవారు. కోళ్లకు, గేదెలకు పెట్టేవారు. ఇప్పుడు ప్రతిఒక్కరూ ఈ బియ్యాన్నే తింటారు.
– గంపల కిష్టమ్మ, నెమ్మికల్లు, ఆత్మకూర్(ఎస్) మండలం
సన్నబియ్యం పర్వాలేదు
గతంలో ఇచ్చిన దొడ్డు రకం బియ్యం కంటే ప్రస్తుతం రేషన్ దుకాణంలో ఇస్తున్న సన్న బియ్యం పర్వాలేదు. అన్నం కొద్దిగా మెత్తగా అవుతోంది. గతంలో ఉన్న బియ్యం తినలేకపోయాం. నాకు నెలకు ఆరు కిలోలు వస్తాయి. సన్నబియ్యం నిరంతరం ఇస్తే బాగుంటుంది. – కిన్నెర రాములమ్మ, తిప్పర్తి
ఫ సరిగ్గా వండితే.. సాఫీగానే భోజనం
ఫ కొన్నిరోజులు ఆగి వండుకుంటే మరింత బాగు
ఫ గంజి సరిగ్గా వార్చకపోతే కాస్త ముద్దగా అన్నం
ఫ కొంతమేర నూకలు.. అయినా బాగున్నాయని ఆనందం
అమ్ముకోం.. వండుకుంటం
అమ్ముకోం.. వండుకుంటం
అమ్ముకోం.. వండుకుంటం
అమ్ముకోం.. వండుకుంటం
అమ్ముకోం.. వండుకుంటం
అమ్ముకోం.. వండుకుంటం