సెంచూరియన్‌లో ఉత్కళ కృషి మేళా | - | Sakshi
Sakshi News home page

సెంచూరియన్‌లో ఉత్కళ కృషి మేళా

Feb 12 2026 7:18 AM | Updated on Feb 12 2026 7:18 AM

సెంచూరియన్‌లో ఉత్కళ కృషి మేళా

సెంచూరియన్‌లో ఉత్కళ కృషి మేళా

పర్లాకిమిడి: వికసిత్‌ భారత్‌, వికసిత్‌ ఒడిశా లక్ష్యంగా సెంచూరియన్‌ వర్సిటీలో చదివే వ్యవసాయ, వెటర్నరీ, ఫిషరీస్‌ విద్యార్థులు చక్కటి ప్రణాళికతో పది మందికీ ఉపాధి కల్పించేలా ఎదగాలని రాష్ట్ర మత్స్య, సూక్ష, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్‌ గోకులానంద మల్లిక్‌ ఆకాంక్షించారు. ఆయన ఆర్‌.సీతాపురం సెంచూరియన్‌ వర్సిటీలో బుధవారం మధ్యాహ్నం నాల్గో ఉత్కళ కృషి మేళా–2026ను ప్రారంభించారు. ఆయనతో పాటు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి, జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, ఉపకులపతి ప్రొఫెసర్‌ సుప్రియా పట్నాయిక్‌, ప్రొఫెసర్‌ వీసీ అజయ్‌ కుమార్‌ నాయక్‌, ఉపాధ్యక్షులు ఆచార్య డి.ఎన్‌.రావు, రిజిస్ట్రార్‌ అనితా పాత్రో, ఎంఎస్‌ స్వామినాథన్‌ వ్యవసాయ విద్యాలయం డీన్‌ ఎస్‌పీ నందా, తదితరులు పాల్గొన్నారు. మంత్రి గోకులా నంద నాయక్‌ సెంచూరియన్‌ వర్సిటీ ఆవరణలో పూలతోట ప్రదర్శన, మేకలు, కోళ్ల స్లాటర్‌ హౌస్‌ను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి గోకులానంద మల్లిక్‌ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కామధేను యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement