అందుబాటులో టోమోథెరపీ సేవలు | - | Sakshi
Sakshi News home page

అందుబాటులో టోమోథెరపీ సేవలు

Dec 31 2025 8:41 AM | Updated on Dec 31 2025 8:41 AM

అందుబాటులో టోమోథెరపీ సేవలు

అందుబాటులో టోమోథెరపీ సేవలు

ఎంవీపీ కాలనీ : క్యాన్సర్‌ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను విశాఖపట్నం జిల్లా ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్‌ హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్‌ రోగులకు ఉపశమనం కలిగించేలా మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌ ఏపీలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా క్యాన్సర్‌ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడం సాధ్యమవుతుందన్నారు. ఎండీ మాట్లాడుతూ రూ.32 కోట్లు విలువైన ఈ యూనిట్‌ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పిటల్‌ దేశంలో లెవల్‌–3 కేటగిరి హాస్పిటల్స్‌గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్‌ ట్యూమర్‌ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పటల్‌ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖలోని మహాత్మా గాంధీ క్యాన్సర్‌ ఆస్పత్రిలో

టోమోథెరపీ యూనిట్‌ను ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement