కబడ్డీలో రన్నర్‌గా రిమ్స్‌ జట్టు | - | Sakshi
Sakshi News home page

కబడ్డీలో రన్నర్‌గా రిమ్స్‌ జట్టు

Dec 16 2025 4:57 AM | Updated on Dec 16 2025 4:57 AM

కబడ్డీలో రన్నర్‌గా రిమ్స్‌ జట్టు

కబడ్డీలో రన్నర్‌గా రిమ్స్‌ జట్టు

శ్రీకాకుళం: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల(రిమ్స్‌) కబడ్డీ జట్టు డా.ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిసెంబర్‌ 9 నుంచి 11వ తేదీ వరకు రాజమండ్రిలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో జరిగిన 27వ ఇంటర్‌ కళాశాలల క్రీడా టోర్నమెంట్‌–2025లో అద్భుత ప్రదర్శన కనబరిచి రన్నరప్‌గా నిలిచింది.

ఈ టోర్నమెంట్‌లో మొత్తం 23 జట్లు పాల్గొన్నాయి. జట్టు విజయం సాధించడానికి కృషి చేసిన ప్రిన్సిపాల్‌ డా.ఎస్‌.అప్పల నాయుడు, ఫిజికల్‌ డైరెక్టర్‌ డా.బి.గౌరి నాయుడు, అలాగే క్రీడా మండలి సభ్యులైన డా.ఎల్‌.ప్రసన్న కుమార్‌, డా.ఎస్‌.నరసింహమూర్తిలను కళాశాల బృందం అభినందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement