
● ప్రజల్లోకి కూటమి వైఫల్యాలు
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ.. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి సంబంధించి పోలాకి రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం నరసన్నపేట నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం తదితరులు పాల్గొన్నారు.
– నరసన్నపేట