
జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఎన్నిక
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆమదాలవలస ఎమ్మె ల్యే, రాష్ట్ర పీయూసీ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎస్ఆర్ ట్రస్ట్ అధినేత సూర శ్రీనివాసరావు, కోశాధికారిగా జీవీ సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా మొజ్జాడ వెంకటరమణతోపాటు మిగిలిన కార్యవర్గ సభ్యులు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం నగరంలోని క్రిస్టల్ ప్యాలెస్ వేదికగా పీడీ–పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు, సాఫ్ట్బాల్ సంఘ ముఖ్య ప్రతినిధి ఎంవీ రమణ అధ్యక్షతన గురువారం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంతోపాటు నూతన కార్యవర్గ ఎన్నికలను నిర్వహించారు. ఆమదాలవలసలో ఉన్న స్టేడియాన్ని సాఫ్ట్బాల్ స్టేడియంగా రూపొందిస్తామని కూన తెలిపారు.
జిల్లా నూతన కార్యవర్గం..
సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్గా కలిదిండి నరసింహారాజు, అధ్యక్షునిగా కూన రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా సూర శ్రీనివాసరావు, కన్వీనర్గా బడగల హరిధరరావు, కోశాధికారిగా జీవీ సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా మొజ్జాడ వెంకటరమణ, ఉపాధ్యక్షులుగా ఎం.తిరుపతిరావు, బి.సురేష్, సంయుక్త కార్యదర్శులగా ఏ.ఢిల్లేశ్వరరావు, ఎం.ఆనంద్కిరణ్, కార్యవర్గసభ్యులుగా పేడాడ బాబురావు, ఎస్వీ రమణ, డి.పెంటయ్య, ఎస్.రామరాజు, కె.వరలక్ష్మి, జి.దుర్గాప్రశాంతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.