
నీట్
● ప్రశాంతంగా ముగిసిన
శ్రీకాకుళం న్యూకాలనీ:
జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన జాతీయస్థాయి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్(నీట్) ప్రశాంతంగా ముగిసింది. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల కేంద్రంలో 480 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 11 మంది గైర్హాజరయ్యారు. దీంతో 469 మంది పరీక్ష రాశారు. సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి అవస్థలు పడ్డారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కణితి శ్రీరా ములు సీఎస్గా వ్యవహరించి పర్యవేక్షించారు.
ఎచ్చెర్ల క్యాంపస్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశ పరీక్ష నీట్–2025 ఆదివారం ప్రశాంతంగా జరిగింది. శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఎస్ఎంపురం క్యాంపస్లో 720 మంది విద్యార్థులకు 713 మంది హాజరయ్యారు. ఏడుగురు గైర్హాజరయ్యారు. కుశాలపురం పరిధి శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 240 మంది వద్యార్థులకు 233 మంది హాజరయ్యారు. ఏడుగురు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లోనికి 11.30 నుంచి విద్యార్థులను అనుమతించారు. మధ్యాహ్నం రెండు గంటలు నుంచి సాయంత్రం ఐదు గంటలు వరకు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఉదయం 11 గంటలకే పరీక్ష కేంద్రాలను చేరుకున్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ట్రిపుల్ ఐటీ ఏఓ ముని రామకృష్ణ, డీఎస్పీ వివేక నంద, తహసీల్దార్ బి.గోపాలరావు పరీక్షలు పర్యవేక్షించారు.

నీట్

నీట్

నీట్