లైను కడితేనే రేషను | - | Sakshi
Sakshi News home page

లైను కడితేనే రేషను

Jun 2 2025 12:14 AM | Updated on Jun 2 2025 12:14 AM

లైను

లైను కడితేనే రేషను

మెళియాపుట్టి

రేషన్‌ షాపుల వద్ద క్యూ కట్టిన లబ్ధిదారులు

ఎండీయూ వాహనాలను పూర్తిగా రద్దు చేసిన ప్రభుత్వం

గిరిజన ప్రాంతాల్లో నడవలేక అవస్థలు

మైదాన ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్యలు

కొత్తూరు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:

ప్రజలకు రేషన్‌ కష్టాలు ప్రారంభమయ్యా యి. ఇంటి వద్దనే ప్రశాంతంగా రేషన్‌ తీసుకునే సదుపాయాన్ని రద్దు చేసి కూటమి ప్రభుత్వం రేషన్‌ డిపోలను తెరిచింది. దీంతో పనులు మానుకుని డిపోల వద్ద నిరీక్షించే పాత సంప్రదాయానికి మళ్లీ తెర తీసినట్టైంది.

ఆరేళ్ల కిందట ఇలా..

ఆరేళ్ల కిందట నాటి టీడీపీ ప్రభుత్వం హయాంలో డిపోల వద్ద జనాలు రాత్రీపగలు నిరీక్షించేవారు. కొన్ని సందర్భాల్లో రోజంతా కాపు కాసినా సరుకు లు దొరికేవి కావు. కూలి పనులు మానుకుని డిపోల వద్ద ఎదురు చూడాల్సి వచ్చేది. వృద్ధులు, దివ్యాంగులు సరుకులు తీసుకోవాలంటే పెద్ద ప్రయాసగా ఉండేది. ఈ పాస్‌ పేరిట నెట్‌ అందక తీవ్రంగా ఇబ్బంది పడేవారు. ఇక డీలర్ల చేతివాటానికి వారిపై నమోదైన 6ఎ కేసులే సాక్షి.

వాహనాలు రద్దు చేసి..

కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్‌ జగన్‌ మార్కు ఉన్న ప్రతి వ్యవస్థపై విషం జల్లుతూ వచ్చింది. అందులో భాగంగానే పేదల కోసం ప్రవేశపెట్టిన రేషన్‌ బండ్ల వ్యవస్థను రద్దు చేసి రేషన్‌ డీలర్లు చేతికి పంపిణీ పగ్గాలు ఇచ్చారు. నేరుగా డీలర్‌ వద్దకు వెళ్లి రేషన్‌ తీసుకోవాలని ఆదేశించారు. దీంతో మళ్లీ రేషన్‌ కష్టాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 422 రేషన్‌ వాహనాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 383 కాగా, పట్టణ ప్రాంతాల్లో 39 వాహనాలు ఉన్నాయి. వీటిని రద్దు చేయడంతో పాటు ఈ వాహనదారుల ఉపాధిని కూడా దూరం చేసింది.

కంది పప్పునకు ఎగనామం

జిల్లాలో గత ఆరు నెలలుగా కంది పప్పు రేషన్‌ సరుకుల్లో ఇవ్వడం లేదు. కేవలం బియ్యం, పంచదారను మాత్రమే ఇస్తున్నారు. 2025 జనవరి, ఫిబ్ర వరి నెలల్లో చాలా మందికి బియ్యం కూడా ఇవ్వలే దు. డీలర్ల వ్యవస్థ రావడంతో ఇలాంటి అక్రమాలు పెచ్చుమీరుతాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ పాలనలో..

కనీస సౌకర్యాలు కల్పించలేని

ప్రభుత్వం ఎందుకు

ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం ఎందుకు. ఏడాదిగా ఎంతో మంది రేషన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మంజూరు చేయలేదు. దీనికి తోడు రేషన్‌లో బియ్యం, పంచదార తప్ప ఇంకేమీ ఇవ్వడం లేదు. చంద్రబాబు పాలన ఇలాగే ఉంటుంది. – బొడ్డేపల్లి నారాయణరావు,

డీసీసీబీ మాజీ డైరెక్టర్‌

రేషన్‌ బియ్యం కష్టాలను నాటి పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి జనాలు వివరించారు. దీంతో డీలర్ల అవినీతికి ఆయన చెక్‌ పెట్టారు. డిపోల వద్ద నించోవాల్సిన అగత్యం లేకుండా రేషన్‌ వాహనాల పద్ధతి ప్రవేశపెట్టి ఇంటి వద్దకే సరుకులు అందజేశారు. కచ్చితమైన తూనికలు, పారదర్శకంగా రేష న్‌ సరుకులు లబ్ధిదారులకు అందేవిధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులతో పాటు జనమంతా సంతోషంగా సరుకులు తీసుకునేవారు. వేల మందికి ఉపాధి కూడా దొరికింది.

కొత్త రేషన్‌ కార్డు అందని ద్రాక్షే

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం నుంచి కొత్తగా ఒక్క రేషన్‌ కార్డు కూడా మంజూరు చేయలేదు. జిల్లా వ్యాప్తంగా 657 సచివాలయాల పరిధిలో సుమారు 45,990 మంది కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొంతమందివి ఆన్‌లైన్‌ ప్రక్రియ కాగా మరికొందరివి సచివాలయాల్లో సర్వర్‌ డౌన్‌తో ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు ఉంచారు. ఈ రేషన్‌ కార్డుల కోసం అటు తహసీల్దార్‌ కా ర్యాలయానికి, ఇటు గ్రామ సచివాలయాలకు నిత్యం తిరుగుతూ కాళ్లరిగిపోతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – ఆమదాలవలస

లైను కడితేనే రేషను 1
1/4

లైను కడితేనే రేషను

లైను కడితేనే రేషను 2
2/4

లైను కడితేనే రేషను

లైను కడితేనే రేషను 3
3/4

లైను కడితేనే రేషను

లైను కడితేనే రేషను 4
4/4

లైను కడితేనే రేషను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement