● ఆఫ్‌షోర్‌ నిర్వాసితుల బైక్‌ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

● ఆఫ్‌షోర్‌ నిర్వాసితుల బైక్‌ ర్యాలీ

Jun 2 2025 12:14 AM | Updated on Jun 2 2025 12:14 AM

● ఆఫ్‌షోర్‌ నిర్వాసితుల బైక్‌ ర్యాలీ

● ఆఫ్‌షోర్‌ నిర్వాసితుల బైక్‌ ర్యాలీ

మెళియాపుట్టి: రేగులపాడు ఆష్‌షోర్‌ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యవసాయకార్మిక సంఘం ఉపాధ్యక్షుడు గంగారపు సింహాచలం డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో చీపురుపల్లిలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ కోసం ఇళ్లు, భూములు, గ్రామాన్ని సైతం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. చీపురుపల్లి గ్రామ పురవీధుల్లో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించి సమస్యలపై నినాదాలు చేశారు. పునరావాస కాలనీల్లో ఇప్పటికీ రహదారులు, వీధి దీపాలు, మౌలిక సదుపాయాలు లేవన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ యవ్వారి ఈశ్వరరావు,దొర విజయ్‌ కుమార్‌, కిరణ్‌,మాధవరావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement