
ఆయుష్షు మిగలదు
ఆనవాలే ఉండదు..
పురుగు బారిన పడి నేలకొరిగిన కొబ్బరి మొక్కలు
ఇచ్ఛాపురం రూరల్: ఉద్దానం కొబ్బరిపై ఎర్రముక్కు పురుగు పంజా విసురుతోంది. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిత్లీ తుఫాన్కు నేలకొరిగిన కొబ్బరి చెట్ల ప్రాతంలో రైతులు కొబ్బరి మొ క్కలు నాటారు. మొక్కలు పెరుగుతున్న సమయంలో ఎర్రముక్కు పురుగు ఆశిస్తుండటంతో పచ్చగా కనిపిస్తూనే కొబ్బరి మొక్కలు నేలకొరుగుతున్నా యి. దీంతో కొబ్బరి రైతులు ఆందోళన చెందుతు న్నారు. ఈ పురుగు అన్ని వయస్సుల కొబ్బరి చెట్లను, తోటలను ఆశిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. కొబ్బరి చెట్ల మొవ్వులో రంధ్రాలు చేసి, చెట్టు మరణానికి కారకాలుగా మారుతున్నాయి. మొక్కకు ఎర్ర ముక్కు పురుగు ఆశించినప్పటికీ చెట్టు పచ్చగానే ఉంటుండటంతో రైతులు త్వరగా మేలుకోలేకపోతున్నారని, కొబ్బరిదిగుబడి తగ్గడం, కొద్ది రోజుల తరువాత చెట్టును నష్టానికి గురిచేస్తుందని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు.
ఆనవాలు లేకుండానే..
చెట్టు లోపలి భాగంలో ఆవాసం ఏర్పాటు చేసుకు న్న ఎర్రముక్కు పురుగు అక్కడే సంతానోత్పత్తి చేసి ఆరోగ్యకరంగా ఉన్న కొబ్బరి చెట్టును నాశనం చేస్తుంది. చెట్టు నేలకొరిగే వరకు రైతు ఎలాంటి ఆనవాలు పసిగట్టలేకపోవడంతో నష్టపోతున్నాడు. దీంతో ఏడాదికి ఎకరానికి నాలుగైదు చెట్లను రైతు కోల్పోతున్నాడు. లేత కొబ్బరి చెట్లకు ఇది ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్దానం కొబ్బరిని ఆశిస్తున్న
ఎర్రముక్కు పురుగు
నేలకొరుగుతున్న కొబ్బరి మొక్కలు
పచ్చగా కనిపిస్తూనే పాడైపోతున్న వైనం
సామూహిక సస్యరక్షణే మేలు

ఆయుష్షు మిగలదు

ఆయుష్షు మిగలదు