
మెళియాపుట్టి క్రీడాకారుడికి గోల్డ్మెడల్
మెళియాపుట్టి : మండల కేంద్రం మెళియాపుట్టికి చెందిన పొట్నూరు అనిరుథ్ రోల్బాల్ (స్కేటింగ్)లో సత్తాచాటాడు. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటడంతో శ్రీలంక దేశంలోని మినువాంగోడలో జరుగుతున్న అంతర్జాతీయ పోటీలకు అవకాశం కలిగింది. గురువారం జరిగిన పోటీల్లో భారత్ తరఫున బంగారు పతకం సాధించాడు. అనిరుద్ధ్కు తల్లిదండ్రులు నవీన్కుమార్, మీనాక్షి, గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
మహిళ ఆత్మహత్య
సారవకోట : వాండ్రాయి గ్రామానికి చెందిన రాడ పార్వతమ్మ (59) అనారోగ్యంతో బుధవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.భర్త ఆనందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ అనిల్కుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఆస్పత్రికి తరలించారు. పార్వతమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
రణస్థలం: పాతర్లపల్లి పంచాయతీలోని వెంకటేశ్వర కాలనీలో రేగాన ఉత్తరమ్మ ఇంట్లో ఈ నెల 25న బంగారం వస్తువులు చోరీకి గురయ్యాయ ని జె.ఆర్.పురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అదే ఇంట్లో ఉన్న శైలు, అతని ప్రియుడు డి.దుర్గా ప్రసాద్లే దొంగతనం చేసినట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. నిందితులకు వచ్చే నెల 11 వరకు కోర్టు రిమాండ్ విధించిందని చెప్పారు. బంగారాన్ని రికవరీ చేశామని తెలిపారు.
బాడీబిల్డింగ్ పోటీల్లో ప్రతిభ
కాశీబుగ్గ: అండమాన్ నికోబార్ దీవుల్లోని ల్యాండ్ పోర్టుబ్లెయిర్లో నిర్వహించిన జాతీ య స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పలాస–కాశీబుగ్గకు చెందిన ఎం.శివకుమార్ సత్తాచాటాడు. మిస్టర్ అండమాన్ హంట్ విభాగంలో 170 కేటగిరీలో ద్వితీయ స్థానం కై వసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా విజేతలను సిల్వర్ మెడల్తో సత్కరించారు. ఈ సందర్భంగా జంటపట్టణాల బాడీబిల్డర్స్ గురువారం అభినందనలు తెలిపారు.
హెచ్ఎంలకు బదిలీ ఉత్తర్వులు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ సాధారణ బదిలీల్లో భాగంగా గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఆప్షన్ ప్రకారం ఎంచుకున్న స్కూళ్లకు బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు అందుకున్న హెచ్ఎంలు విధుల్లో చేరాలని డీఈఓ తిరుమల చైతన్య ఆదేశించారు.
హెడ్ కానిస్టేబుల్పై దాడి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని మంగువారితోట లెప్రసీ కాలనీ వద్ద మత్తులో ఉన్న యువకులు ఓ హెడ్కానిస్టేబుల్పై దాడి చేశారు. వారు గంజాయి మత్తులో ఉన్నారా.. లేదంటే మద్యం మత్తులోనే దాడికి పాల్పడ్డారా అన్నది తెలియాల్సి ఉంది. శ్రీకాకుళం ఒకటో పట్టణ ఏఎస్ఐ రాంబాబు, స్థానికులు చెప్పిన వివరాల మేరకు.. జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరో (డీసీఆర్బీ) విభాగంలో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న త్రినాథ్ గురువారం రాత్రి విధులు ముగించుకుని లెప్రసీ కాలనీలో ఉన్న తన ఇంటికి బయల్దేరాడు. మంగువారి తోట వద్ద కాలనీలో వెళ్తుండగా నలుగురు యువకులు మత్తులో రోడ్డుపై న్యూసెన్సు చేస్తున్నారు. ఈ క్రమంలో బండిపై వెళ్తున్న హెచ్సీ త్రినాథ్కు ఓ యువకుడి చేయి తగలడంతో ‘ఈ సమయంలో ఇలా చేస్తున్నారేంటి’ అని ప్రశ్నించారు. దీంతో నలుగురు యువకులు హెచ్సీతో వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా దాడికి ఎగబడ్డారు. ఈ పరిణామం నుంచి తేరుకునేలోపే హెచ్సీకి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. గాయపడిన త్రినాథ్ను రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై ఎంఎల్సీ అయ్యిందని రిమ్స్ ఔట్పోస్ట్ అధికారులు నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మెళియాపుట్టి క్రీడాకారుడికి గోల్డ్మెడల్