
కలిసికట్టుగా పనిచేయాలి..
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అసమర్థులంకాదు. బలహీనులం అసలే కాదు. మన రోజు వచ్చినప్పుడు తడాఖా చూపించాలి. అంతవరకూ కలసికట్టుగా పని చేయాలి. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి మంచి నాయకత్వం ఉంది. పూర్వ వైభవం తప్పక వస్తుంది.అన్ని రంగాల్లోనూ కూటమి ప్రభుత్వం విఫలమైంది. చంద్రబాబు సొంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి అధికారం సాధించారు. అధినేత జగన్ అనుమతిస్తే భవిష్యత్తులో నరసన్నపేట అభ్యర్థిగా కృష్ణ చైతన్య పోటీ చేస్తారు.
– ధర్మాన కృష్ణదాస్,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు