
పీజేఆర్ఎస్ మహారధ, న్యూ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు
లక్ష్మీపురం టోల్ప్లాజా వద్ద కాశీబుగ్గ పోలీసులకు ప్రతి నెలా రూ.50వేలు లంచం ఇస్తున్నారు. పలాస–కాశీబుగ్గ పట్టణంలోకి లారీ వెళ్తే రూ.వందలలో వసూళ్లు చేస్తున్నారు. టోల్ప్లాజా వద్ద లారీలలో అదనపు లోడ్ ఉందని ఎక్కడా లేని విధంగా రశీదు లేకుండా నగదు వసూలు చేస్తున్నారు. ఏ ఒక్కరు ప్రశ్నించినా కొట్టడానికి వస్తున్నారు.
ప్రస్తుతం లక్ష్మిపురం టోల్ప్లాజా కాంట్రాక్ట్ రద్దు చేయాలని కోరుతున్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తాం. ఆపదలో పోలీసుల సాయం కోరితే తిరిగి మాకే ఫైన్ వేస్తారా. ఇది ఇక్కడితో విడిచిపెట్టం. రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతాం.
– పీజేఆర్ఎస్ మహారధ, న్యూలారీ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ