స్టైఫండ్‌తో కూడిన శిక్షణ | - | Sakshi
Sakshi News home page

స్టైఫండ్‌తో కూడిన శిక్షణ

May 2 2025 1:30 AM | Updated on May 2 2025 1:30 AM

స్టైఫండ్‌తో కూడిన శిక్షణ

స్టైఫండ్‌తో కూడిన శిక్షణ

శ్రీకాకుళం రూరల్‌: మండల పరిధిలోని రాగోలు జెమ్స్‌ ఆస్పత్రి బొల్లినేని మెడిస్కిల్స్‌ నందు డిగ్రీ చదివిన విద్యార్థులకు స్వల్పకాలిక సర్టిఫికేట్‌ కోర్సును నిర్వహిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుకు డిగ్రీ పాసైన లేదా ఫెయిల్‌ అయిన విద్యార్థులు అర్హులన్నారు. 18 నుంచి 30 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. 6 నెలలు శిక్షణ ఉంటుందన్నారు. ఎంపికై నవారికి శిక్షణలో స్టైఫండ్‌ అందిస్తామన్నారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 76809 45357, 79950 13422 నంబర్లను సంప్రదించాలన్నారు.

8న సహకార సంఘ ఎన్నికలు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గొర్రెలు, మేకలు పెంపకందారుల సహకార యూనియన్‌ లిమిటెడ్‌ శ్రీకాకుళం ఎన్నికలు ఈనెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి డాక్టర్‌ పి.రామ్మోహన్‌రావు గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయంలో ఎన్నికల రూల్‌ 22(బీ) పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. చేతు లు పైకెత్తే పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామన్నా రు. ఎన్నికల అధికారి ప్రకటించిన నోటీసు, ఓటర్ల జాబితా సంయుక్త సంచాలవారి కార్యా లయంలో నోటీసు బోర్డులో పెట్టినట్లు పేర్కొన్నారు. అదేరోజు నామినేషన్ల అనంతరం ఎన్ని కలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎటువంటి సందేహాలున్నా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

నాటుసారాతో పట్టుబడిన వ్యక్తి

కవిటి: మండలంలోని బంజుపుట్టుగ తోటల్లో గురువారం మొబైల్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన బంజు శ్యామరావు అనే వ్యక్తిని 100 నాటుసారా ప్యాకెట్లతో పట్టుకున్నామని మొబైల్‌ టీమ్‌ సీఐ జీవీ రమణ తెలిపారు. ఈ మేరకు స్వాధీనం చేసు కున్న నాటుసారా ప్యాకెట్లు, సదరు నిందితుడి ని ఎకై ్సజ్‌శాఖ సిబ్బందికి తదుపరి చర్యల నిమిత్తం అప్పగించినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement